ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 2, 2020, 10:28 PM IST

ETV Bharat / videos

ప్రతిధ్వని: మద్దతు ధరకు ఇక నీళ్లు వదులుకోవాల్సిందేనా ?

ఆరుగాలం కష్టపడి ప్రకృతి సవాళ్లను తట్టుకుని రైతాంగం చేసిన కృషితో ఖరీఫ్​ పంటలు బాగా సాగయ్యాయి. పంటల దిగుబడి పెరిగింది. మరో వైపు కొత్త మార్కెటింగ్​ ఏడాది ప్రారంభమైంది. మార్కెట్లకు పంట ఉత్పత్తుల రాక ఆరంభమైంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లలో తన వాటాను తగ్గించింది. విదేశాల నుంచి మొక్కజొన్న కొనుగోళ్లకు ద్వారాలు తెరిచింది. రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కజొన్న కోనేది లేదని అంటున్నాయి. దీంతో ప్రైవేటు మార్కెట్లదే ఇష్టా రాజ్యంగా మారిపోతుందా? భారీ దిగుబడులతో కొనుగోళ్లు అదే స్థాయిలో ఉంటాయా? కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు రాష్ట్రాలు ఏ మేరకు భారోసాను కల్పిస్తాయి? మద్దతు ధరకు ఇక నీళ్లు వదులుకోవాల్సిందేనా? వీటికి పరిష్కార మార్గాలు, ప్రత్యమ్నాయాలు ఏమిటి? అనే అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details