ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: కరోనా కాలంలోనూ అభివృద్ధి బాటలో ఐటీ రంగం - debate on IT sector

By

Published : Feb 25, 2021, 9:31 PM IST

కరోనా కాలంలోనూ ఐటీ రంగం కళకళలాడింది. దేశవ్యాప్తంగా కరోనా వల్ల చాలా రంగాలు కుంటుపడిపోయినప్పటికీ ఐటీ రంగం మాత్రం సానుకూలంగా ముందుకు కదులుతోంది. ఈ ఏడాదికి సంబంధించి రూ.14.5లక్షల కోట్లు ఆదాయం వస్తుందని నాస్కామ్ అంచనా వేస్తోంది. ఐటీ కంపెనీలు దాదాపుగా 1.36 లక్షల ఉద్యోగాలను ఇప్పటివరకు ఇవ్వగలిగాయి. అలాగే కొత్త అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఐటీ రంగం సానుకూల దృక్పథంతో ముందుకు కదులుతుండటంతో ముందు ముందు నియామకాలు కూడా పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఐటీ రంగంలో రాబోతున్నటువంటి కొత్త మార్పులేంటి? కొత్త తరహా కోర్సులు, టెక్నాలజీలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details