ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎంపీడీవో కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చేసిన వైసీపీ నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2024, 10:30 PM IST

YCP MLA Vikram Reddy Arrange Secret Meeting in Marripadu

YCP MLA Vikram Reddy Arrange Secret Meeting in Marripadu:నెల్లూరు జిల్లా మర్రిపాడులో ఉన్న ఎంపీడీవో కార్యాలయాన్ని వైసీపీ నేతలు పార్టీ కార్యాలయంగా మార్చేశారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎంపీడీవో సమావేశ కార్యాలయ మందిరంలో రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న 50 ఇళ్లకు సంబంధించిన ఓట్లు తమ పార్టీకే వచ్చే విధంగా ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గ్రామ వాలంటీర్లకు ఆదేశించినట్లు సమాచారం తెలిసింది. తమ పార్టీకి దొంగ ఓట్లు వేసేలా చూడాలని వైసీపీ నేతలకు ఎమ్మెల్యే చెప్పినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతోనే వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.  గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేను అడిగితే పూర్తి చేస్తాం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న వైసీపీ నేతలు గ్రామానికి ఏమీ అభివృద్ధి చేశారని ప్రజలను ఓట్లు అడగాలంటూ స్థానిక ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details