ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Encroachment_of_Plots_in_Vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2023, 7:43 PM IST

ETV Bharat / videos

YCP Followers Encroachment of Plots at Gunadala: గుణదలలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. స్థలాల కబ్జాకు యత్నం

Encroachment of Plots in Vijayawada: విజయవాడ శివారు ప్రాంతమైన ఒకటో డివిజన్‌లో ఓ స్థల వివాదం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గుణదల ఒకటో డివిజన్​లోని సర్వే నెంబరు 117/2లో 15 ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేసిన 16 ప్లాట్లను..  వైయస్సార్​ కాంగ్రెస్​ పార్టీకి చెందిన కొందరు నాయకుల పేరు చెప్పి.. ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు వాపోయారు. తమ ప్లాట్లలోకి వెళ్లకుండా వారు కంచె అడ్డుగా ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితులు అంతా కలిసి వారి ఫ్లాట్లలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని వైసీపీకి చెందిన కొందరు నాయకులు, ఓ మహిళ అడ్డుకుంటూ ఆ ప్రాంతమంతా హల్​చల్​ చేశారు. అడ్డొచ్చిన వారిపై దాడికి యత్నించారు. ఈ విషయంలో బాధితులకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు మద్దతు పలుకగా.. అక్రమణ  చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి దేవినేని అవినాష్ వర్గీయులు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ ఇరు వర్గాలు వైయస్సార్​ కాంగ్రెస్​ పార్టీ మద్దతుదారులే కావడంతో.. గుణదల పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఈ విషయం పట్ల అసలు అక్కడ గొడవే జరగలేదని తొలుత  బుకాయించిన పోలీసులు..  అందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావటంతో కంగుతిన్నారు. బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details