ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Venkateswara Temple Pavithrotsavam

ETV Bharat / videos

Venkateswara Temple Pavithrotsavam: తిరుమలలో కన్నుల పండువగా.. పవిత్రోత్సవాలు... - భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 10:00 PM IST

Venkateswara swami Pavithrotsavam: తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మొదటిరోజులో భాగంగా ఇవాళ పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శనమిచ్చారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగాయి. పవిత్రోత్సవాలు కారణంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details