ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నెల్లూరులో దుండగులు హల్‌చల్‌ - వృద్ధులపై దాడి, 20 లక్షల విలువైన బంగారం అపహరణ - వృద్ధులపై దాడి చేసి 20 లక్షల బంగారం దొంగలింపు

🎬 Watch Now: Feature Video

three_thieves_Robbery_into_house_in_gold_in_nellore

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 8:24 AM IST

Three Thieves Robbery Into House In Gold In Nellore: నెల్లూరు నగరం కాపు వీధిలోని ఓ ఇంట్లో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు దూరి హల్​చల్‌ చేశారు. పక్కా ప్రణాళికతో మాటు వేసి ఇంట్లో దూరి రూ. 20 లక్షలు విలువ చేసే బంగారం, నగదు అపహరించి పరారయ్యారు. కాపు వీధి ప్రాంతంలోని యేసులాల్‌ జైన్‌, విమల జైన్‌ దంపతులు నివసిస్తున్నారు.  

వారి నివాసంలోకి రాత్రి 9 గంటలు సమయంలో ముగ్గురు వ్యక్తులు ప్రవేశించారు. ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఒంటరిగా ఉండగా వారిపై దాడిచేసి తాళ్లతో బంధించి చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లగా పక్కా ప్లాన్‌తో మాటు వేసిన దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. ఇంటికి తిరిగొచ్చిన కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగల దాడిలో గాయపడిన వృద్ధులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి సీసీ పుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details