ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Teachers Unions Boycotted GAD Meeting in Vijayawada: జీపీఎస్‌పై సమావేశం.. బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 4:37 PM IST

Teachers_Unions_Boycotted_GAD_Meeting_in_Vijayawada

Teachers Unions Boycotted GAD Meeting in Vijayawada: జీపీఎస్ అమలు కోసం విజయవాడలో జీఏడీ సమావేశాన్ని నిర్వహిస్తుండగా.. ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సీపీఎస్​ విధానానికి జీపీఎస్​కు తమ మద్దతు ఉండదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. సీపీఎస్​ను రద్దు చేసి ఓపీఎస్​ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం జీపీఎస్​ను తీసుకురావటాన్ని వారు వ్యతిరేకించారు. ప్రభుత్వం మొండి వైఖరిని అనుసరిస్తోందని మండిపడ్డారు. సీపీఎస్​ రద్దు చేసి.. పాత పెన్షన్​ విధానాన్ని పునురుద్దరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేగానీ ఇతర ప్రత్యమ్నాయాలను ఒప్పుకోవటం లేదన్నారు.  దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తారా లేదా అని ప్రశ్నించారు. జీపీఎస్​లో ఉన్న అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని కోరారు. రహస్యంగా సమావేశాన్ని నిర్వహించిన విధంగా అర్డినెన్స్​ తీసుకురావాలని ప్రభుత్వం యత్నిస్తోందని దుయ్యబట్టారు. అందుకోసమే ప్రభుత్వం నిర్వహించిన ఈ సమావేశాన్ని గతంలో మాదిరిగా బహిష్కరించినట్లు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details