ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతల ధర్నా

By

Published : Mar 21, 2023, 10:18 AM IST

ETV Bharat / videos

ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతల ధర్నా..

ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు సోమవారం ధర్నాలకు దిగారు. అసెంబ్లీ సమావేశంలో కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిపై వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యేలు దాడి చేసిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏపీ అసెంబ్లీలో సభ్యులపై చేయిచేసుకునే పరిస్థితి ఉమ్మడి ఏపీ, ఏపీలో ఎప్పుడూ జరగలేదని వారు పేర్కొన్నారు. బాధిత ఎమ్మెల్యే నిరసన మాత్రమే వ్యవహరించారు, అయితే ఆయనపై వైఎస్సార్​సీపీ ఇలా దాడి చేయటం దారుణమని టీడీపీ నేతలు రాస్తారోకోలు నిర్వహించారు. కుట్రపూరితంగానే వైఎస్సార్​సీపీ ఇలా వ్యవహరించందని ఆరోపిస్తూ ధర్నాలు నిర్వహించారు. ఈ మేరకు టంగుటూరు, కొండెపి, సింగరాయకొండ తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. దళిత ఎమ్మెల్యేపై వైఎస్సార్​సీపీ ఇలా దారుణంగా దాడి చేయడం అన్యాయమని వారు పేర్కొన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడిపోయే సరికి ఓటమిని సహించలేకపోయే ఇలా దారుణంగా వ్యవహరించారని వారు తెలిపారు. దీంతో పాటు వైఎస్సార్​సీపీ డైవర్షన్‌ పాలిటిక్స్‌ మానుకోవాలని అన్నారు. టంగుటూరులో పోలీసులు ఈ నిరసనను అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details