ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Stolen Mobile Phones Worth One Crore Thirty lakhs

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2023, 5:16 PM IST

ETV Bharat / videos

Stolen Mobile Phones Worth One Crore Thirty lakhs: రూ.1 కోటి 30 లక్షల విలువచేసే ఫోన్లు చోరీ... ఎక్కడంటే..!

Stolen Mobile Phones Worth One Crore Thirty lakhs: నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై గల ఓబులాపురం వద్ద  రూ.1 కోటి 30 లక్షల రూపాయల విలువచేసే సెల్ ఫోన్​లను చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్యానా నుంచి బెంగళూరుకి బయలుదేరిన కంటైనర్​లో రూ.1 కోటి 30 రూపాయల విలువచేసే సెల్ ఫోన్లు వెళుతున్నాయి. ఈ వాహనంలో ఇద్దరు డ్రైవర్లు ఉండగా..  కంటైనర్ ఈనెల 11న  ఓబులాపురం మిట్ట వద్దకు రాగానే అక్కడ కంటైనర్​ను ఆపారు. అనంతరం ఇద్దరు డ్రైవర్లు కంటైనర్ తాళం పగలకొట్టారు. అందులో ఉన్న సెల్ ఫోన్లను మరొక వాహనంలోకి ఈ తరలించారు. కంటైనర్ తాళం పగల గొట్టగానే వాహన యజమనికి సందేశం వెళ్లింది. అప్రమత్తమైన యజమాని డ్రైవర్లకు ఫోన్ చేయగా... వారి ఫోన్  స్విచ్చాఫ్ రావడంతో యజమాని నంద్యాలకు బయలుదేరి వచ్చాడు. జాతీయ రహదారిలో కంటైనర్ చాలా సేపు ఆగి ఉండడం గమనించిన హైవే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు  ఆ కంటైనర్​ను పోలీస్ స్టేషన్​కు తరలించారు. నాగాలాండ్​కు చెందిన కంటైనర్ యజమాని ఫల్వాందర్ సింగ్ డోన్ గ్రామీణ పోలీస్ స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేయగా...  ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి.  ఫోన్ల చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్యానాకు వెళ్లి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details