ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వేములవాడ భీమలింగేశ్వరస్వామి రథోత్సవం

By

Published : Jul 6, 2023, 10:28 AM IST

ETV Bharat / videos

Bhimalingeswara Swami rathosthavam: వైభవంగా వేములవాడ భీమలింగేశ్వరస్వామి రథోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు..

Bhimalingeswara Swami rathosthavam: అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లులోని శ్రీ వేములవాడ భీమలింగేశ్వర స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి జీవ సమాధి, మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత.. ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో తీసుకొచ్చి రథంపై కొలువుతీర్చారు. ఉత్సవంలో భాగంగా రథానికి ప్రత్యేక పుష్పలంకరణ చేశారు. ఈ రథోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు టెంకాయిలు, మద్యం నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అశేష జనవాహిణి మధ్య భీమలింగేశ్వరస్వామి వారి రథోత్సవం కమనీయంగా జరిగింది. వేలాదిమంది భక్తులు చేసిన భీమలింగేశ్వర నామస్మరణతో గడేకల్లు పులకించింది. ఈ ఉత్సవాలకు ఏపీ నుంచేకాక కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు హాజరయ్యారు. అశేష జనవాహిణి మధ్య రథోత్సవం కన్నుల పండువగా సాగింది. స్వామి వారి రథోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో.. గడేకల్లు గ్రామం కిక్కిరిసి పోయింది. రథోత్సవానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా.. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచోసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

For All Latest Updates

TAGGED:

rathosthavam

ABOUT THE AUTHOR

...view details