By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2023, 10:31 PM IST
Prathidhwani: మద్యం మంటలు... అసలేం జరుగుతోంది?
Prathidhwani: రాష్ట్రంలో మద్యం మంటలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. మద్యం నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ప్రజల్ని అదే మద్యానికి బలి పెడుతోందని, వారి రక్తమాంసాలతో వ్యాపారం చేస్తోందని చాలాకాలంగా వాపోతున్నాయి విపక్షాలు. ఇప్పుడు అంతకు మించిన రీతిలో ఇందులో జగన్ వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని.., అధికారపక్షం ధనదాహంలో కల్తీ, నాసిరకం మద్యానికి ఎంతోమంది బలైపోతున్నారన్న ఆరోపణలు రాజకీయంగా దుమారానికి దారి తీస్తున్నాయి. అసలు రాష్ట్రంలో మద్యపాన నిషేధంపై వైసీపీ ఏం చెప్పింది? అధికారంలోకి రాగానే ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో నాలుగున్నరేళ్లుగా ఏం జరుగుతోంది? విపక్షాలు ఎప్పటి నుంచో ఫిర్యాదులు చేస్తున్నా... మద్యం కుంభకోణంపై ఇటీవల మరింత విస్తృత చర్చ జరగడానికి కారణం.. ఇటీవల ఏపీ బీజేపీ వెల్లడిస్తున్న విషయాలు. మద్యం కంపెనీల లెక్కలన్నీ పేర్లతో సహా బయట పెడుతున్న ఆ పార్టీ సీబీఐ విచారణ కోరుతోంది. దీనికి ప్రభుత్వం నుంచి సమాధానం ఉందా? రాష్ట్రంలో లివర్ సిరోసిస్, పాంక్రియాటిస్ మరణాల సంఖ్య 25% వరకు పెరిగిందని, అందుకు నాసిరకం మద్యం బ్రాండ్ల వినియోగమే కారణమన్నది విపక్షాల మరో ప్రధాన ఆరోపణ. కల్తీ, నాసిరకం మద్యంతో నిజంగా ఈ స్థాయిలో విపరిణామాలుంటాయా? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.