ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nara_Bhuvaneswari_Nijam_Gelavali_Yatra

ETV Bharat / videos

టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది: 'నిజం గెలవాలి' యాత్రలో నారా భువనేశ్వరి - CHANDRABABU

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2024, 9:48 PM IST

Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: కర్నూలు జిల్లాలో నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వార్త విని మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు మంత్రాలయం నియోజకవర్గంలో పర్యటించారు. పెద్దకడుబూరు మండల కేంద్రంలో హరిజన గోపాల్ కుటుంబాన్ని, కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో వడ్డే ఈరమ్మ కుటుంబాన్ని, మంత్రాలయం మండలం రామచంద్రనగర్ రాగమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 

కాగా నిజం గెలవాలి యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు 3 లక్షల రూపాయల చెక్కు అందిస్తున్నారు. దాదాపు 200 మంది చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో చనిపోయారని తెలుగుదేశం పార్టీ వర్గాలు సమాచారం సేకరించాయి. దీంతో వీరి కుటుంబాలను పరామర్శించేందుకు ‘నిజం గెలవాలి’ పేరిట భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ కారణంగా మృతి చెందిన కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా కల్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details