ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Mobile_Hunt_in_Nellore_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 4:43 PM IST

ETV Bharat / videos

తక్కువ ధరకు వస్తోదందని మొబైల్ కొంటున్నారా? - 500ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు

Mobile Hunt in Nellore District : మొబైల్ హంట్ ద్వారా నెల్లూరు జిల్లాలో భారీగా ఫోన్లు రికవరీ అయ్యాయి. రూ.1.25 కోట్ల విలువ చేసే 500 ఫోన్లను నెల్లూరు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి వాటిని అందజేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఐదు విడతల్లో రూ.4.35 కోట్ల విలువ చేసే 1720 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ఇప్పటివరకు ఫోన్లు చోరీ చేసిన వారిపైనే కేసులు పెట్టామని.. ఇకపై దొంగ ఫోన్లు కొనుగోలు చేసే వారిపైన కూడా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. తక్కువ ధరకు వస్తున్నాయని ఎవరైనా దొంగ ఫోన్లు కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇన్ని రోజులు ఇలాంటి నేరాలపై అవగాహన కల్పించాం.. కానీ ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వెంటనే మొబైల్ హంట్ కు ఫిర్యాదు చేస్తే రికవరీకి చర్యలు తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details