జగన్ను సీఎం చేసేలా విద్యార్థులంతా తల్లిదండ్రులపై ఒత్తిడి తేవాలి - ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు - అమలాపురంలో ట్యాబ్ల పంపిణీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 3:05 PM IST
MLC Kudupudi Suryanarayana Rao Controversial Comments: కోనసీమ జిల్లా అమలాపురంలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు (YSRCP MLC Kudupudi Suryanarayana Rao) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లు పంపిణీ (Byjus tabs Distribution for Students in Amalapuram) చేసిన సమయంలో ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్ను ముఖ్యమంత్రి(CM Jagan)గా చేసే విధంగా పిల్లలంతా తల్లిదండ్రులపై ఒత్తిడి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ సీఎం కాకపోతే విద్యార్థుల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతాయని హెచ్చరించారు. విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
"రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిగా చేసే విధంగా పిల్లలంతా తల్లిదండ్రులపై ఒత్తిడి చేయాలి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ సీఎం కాకపోతే విద్యార్థుల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతాయి."- కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ