ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Man_Died_with_Heart_ Attack_in_Kuwait_Resident_of_Prakasam_District

ETV Bharat / videos

గుండెపోటుతో వ్యక్తి మృతి - కడసారి చూపు కోసం ప్రభుత్వాన్ని కోరుతున్న కుటుంబసభ్యులు - goharapalli person died in kuwait heart attack

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 3:13 PM IST

Man Died with Heart Attack in Kuwait Resident of Prakasam District: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. చిన్నా,పెద్ద అని తేడా లేకుండా చాలా మంది హఠాత్తుగా హార్ట్ ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నడుస్తూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, ఇలా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై తనువు చాలిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి పొట్టకూటి కోసం కువైట్ దేశానికి వెళ్లి గుండెపోటుతో అక్కడ కన్నుమూశారు. దీంతో ఆ గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి.

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోహారపల్లి గ్రామానికి చెందిన దాసరి అంకయ్య(37) పొట్టకూటి కోసం కువైట్ దేశానికి వెళ్లాడు. అంకయ్యకు అఖిల, అర్చన అనే ఇద్దరు కుమార్తెలతో పాటూ అక్షయ్(8) కుమారుడు ఉన్నాడు.  గతంలో రెండు సంవత్సరాలు కువైట్ కి వెళ్లి వచ్చారని, ఆర్థిక ఇబ్బందులు నెలకొనడడంతో ఇటీవలే అంకయ్య మళ్లీ కువైట్​కి వెళ్ళారని కుటుంబ సభ్యులు తెలిపారు. అంకయ్య మరణించిన విషయం తెలిసి మృతుడి భార్య సుబ్బలక్ష్మమ్మ కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది. తండ్రిని పిల్లలు చివరి చూపు చూసుకునేందుకు అంకయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి ప్రభుత్వం సహాయం చేయాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details