PRATHIDWANI : అమరావతిపై ఎన్నిమాటలు చెబుతారు? రైతులకు నాడు ఇచ్చిన హామీలు ఏమిటి? వారికి చేసిన ఒప్పందాల్లో ఏం పేర్కొన్నారు? ఇప్పుడు వైకాపా ప్రభుత్వం వాదనలకు చట్టపరంగా, రాజ్యాంగ పరంగా ఉన్నవిలువ ఎంత? ఇదే సమయంలో.. కొందరు పెత్తందారుల కోసం అమరావతి ఉద్యమం చేస్తున్నారని ఘాటు ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర అసెంబ్లీలో వికేంద్రకరణ అంశంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన 3 రాజధానుల అంశంపై మరోమారు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ పరిణామాలను ఎలా చూడాలి? న్యాయం కావాలంటూ అమరావతి రైతులు.. అమరావతి నుంచి అరసవెల్లి వరకు మహాపాదయాత్ర చేపట్టిన తరుణంలోనే ఇలాంటి ప్రకటన రావడంతో వారి ముందున్న మార్గాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST