ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI_Ramakrishna_Fires_on_Cm_Jagan

ETV Bharat / videos

కరవుతో రైతులు అల్లాడుతుంటే సీఎం జగన్ ప్యాలెస్​లో కునుకు తీస్తున్నాడు : సీపీఐ రామకృష్ణ - వర్షాభావ పరిస్థితులతో ఏపీలో రైతుల ఇబ్బందులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 5:42 PM IST

CPI Ramakrishna Fires on Cm Jagan: కరవుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటుంటే సీఎం జగన్ మొద్దు నిద్రపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. కనీసం కరవు మండలాలు ప్రకటించలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీలతో పాటు.. ప్రజలు, రైతులు ప్రభుత్వాలను నిలదీయాలని రామకృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు (Poola Subbaiah Veligonda Project) నికర జలాల సాధన, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికై నిర్వహించిన జిల్లా సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నాయని రామకృష్ణ తెలిపారు. కృష్ణా జలాల పునఃపంపిణీ జరిగితే ఏపీ ఎడారిగా మారుతుందని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఇంతటి కరవు పరిస్థితులు ఏర్పడితే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందన్నారు. తాగు నీటి విషయంలో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరుగుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details