ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Clash_Between_Two_Parties_in_Land_Dispute

ETV Bharat / videos

Clash Between Two Parties in Land Dispute: కత్తులు దూసిన ఇరువర్గాలు.. నలుగురికి తీవ్రగాయాలు.. రిమ్స్​కు తరలింపు - Attacking Opponents With Sword

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2023, 4:22 PM IST

Clash Between Two Parties in Land Dispute :వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండల గ్రామ పంచాయతీ పరిధిలోని మదినాపురంలో ఓ ఇంటి స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మందినాపురం గ్రామానికి చెందిన గుజిరీ దర్బార్ కుమారుడు నాసర్ బాషా ప్రత్యర్థులపై కత్తితో దాడి (Attacking on Opponents With Sword) చేశాడు. ఈ దాడిలో చిన్న కాశీం, ఉమర్ బాషా, అహ్మద్, మహమ్మద్ రఫీ కత్తిపోట్లుకు గురయ్యారు. అలాగే దర్బార్ వర్గంలో కూడా ముగ్గురికి గాయాలయ్యాయి.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘర్షణకు దిగిన ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గాయపడిన వారిని పోలీసులు వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కత్తిపోట్లకు గురైన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్​కి తీసుకెళ్లారు. ఈ ఘర్షణకు స్థల వివాదం కారణమా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. విచారణ చేస్తామని వేంపల్లి ఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details