ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Car_Accident_In_Chintakunta_Kurnool_Dist

By

Published : Aug 10, 2023, 1:31 PM IST

ETV Bharat / videos

Car Accident In Chintakunta: కర్నూలు జిల్లాలో కారు బోల్తా.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

Car Accident In Chintakunta Kurnool Dist: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సిడిగినమల ప్రాంతానికి చెందిన ఏడుగురు వ్యక్తులు కారులో మంత్రాలయం బయలుదేరారు. ఈ క్రమంలో వారి కారు హాలహర్వి మండలం చింతకుంట గ్రామానికి సమీపంలో ఉన్న వంతెన వద్దకు చేరుకోగానే.. అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని ఆ ప్రాంతమంతా పరిశీలించారు. 

ABOUT THE AUTHOR

...view details