ఆంధ్రప్రదేశ్

andhra pradesh

bike_lost_control_crashed_into_well

ETV Bharat / videos

అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన బైక్- ఇద్దరు మృతి - ఏలూరులో బైక్ ప్రమాదం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2024, 4:25 PM IST

Bike Lost Control Crashed Into Well: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో నూతన సంవత్సరం వేళ విషాదఛాయలు అలుముకున్నాయి. కనసానపల్లిలో సోమవారం ఉదయం బైక్​పై వెళ్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికిి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఒకరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. గ్రామ సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నున్న గ్రామానికి చెందిన శెట్టి సాయికుమార్ (24), తలసెల్ల కృష్ణ చైతన్య (24), రాకేష్ (25) ఏలూరు జిల్లాలో బందువులు ఇంటికి వచ్చారు. ఈ ముగ్గురు కలిసి ఆదివారం రాత్రి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని సోమవారం ఉదయం బైక్​పై ఇంటిికి తిరిగివెళ్తుండగా బైక్ అదుపుతప్పింది. దీంతో బైక్​తో సహా ముగ్గురూ నేలబావిలోకి దూసుకెళ్లారు. ప్రమాదం జరిగిన సమయంలో పొలంలో ఉన్న సర్పంచ్ ఇదంతా గమనించి బావి వద్దకు వెళ్లి చూడగా రాకేష్ నీటిపై తేలుతున్నారు. వెంటనే రాకేష్​ను బయటకు తీసుకువచ్చారు. 

స్థానికులు బావిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా ఒక యువకుడు దొిరికాడు. కాని అప్పటికే మృతి చెందాడని, మరో మృతదేహం కోసం బావిలో నీటిని తోడుతున్నారని సర్పంచ్ వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన రాకేష్‌ను విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారన్నారు. ప్రస్తుతం రాకేేష్​కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details