By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 31, 2023, 5:11 PM IST
అమరావతి ఉద్యమ ఫలాలు త్వరలోనే ప్రజలకు అందుతాయి: అమరావతి జేఎసీ
Amaravati JAC Leaders Allegations on CM Jagan:అమరావతి ఉద్యమ స్ఫూర్తితో జగన్ పాలనలో నష్టపోయిన వారంతా రోడ్డెక్కి నినదిస్తున్నారని రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు (JAC Leaders on CM Jagan) అభిప్రాయపడ్డారు. అమరావతి ఉద్యమ ఫలాలు రాష్ట్ర ప్రజలకు త్వరలోనే అందుతాయని అన్నారు. అమరావతి బహుజన ఐకాస కన్వీనర్ పోతుల బాలకోటయ్య రూపొందించిన ప్రజాగ్రహం క్యాలెండర్ను సుధాకర్ వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ ఆవిష్కరించారు. రాబోయే 80 రోజులు రాష్ట్రానికి కీలకమని అన్నారు. ముఖ్యమంత్రిని ఎదిరించి లాఠీల దెబ్బలు తిని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన ఘనత అమరావతి మహిళలకే దక్కుతుందన్నారు. సీఎం జగన్ చర్యల వల్ల అన్ని వర్గాల వారు రోడ్లమీదకు వచ్చి ఉద్యమాలు (Amaravati farmers protest) చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై కుట్రలు చేసిన శాసన సభ్యులు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారంటేనే జగన్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.