ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 8, 2020, 11:05 AM IST

ETV Bharat / state

'సాయం అందించండి...  ఊరికి వచ్చేస్తాం'

మహారాష్ట్రలో లాక్ డౌన్ కారణంగా స్వగ్రామాలకు రాలేక ఇరుక్కుపోయిన రైల్వే కోడూరు, చిట్వేల్ మండలాల యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోసం 6 నెలల కిందట మహారాష్ట్ర వెళ్లిన 17 మంది యువకులు స్వగ్రామాలకు వచ్చేందుకు సాయం అందించాలని అధికారులను కోరుతున్నారు. ఈ మేరకు మీడియాకు వీడియో విడుదల చేశారు.

kadapa district
'సాయం అందించండి.. మా ఊరికి పోతాం'

కడప జిల్లా రైల్వే కోడూరు, చిట్వేల్ మండలాలకు చెందిన 17 మంది యువకులు లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్రలో ఇరుక్కుపోయారు. ఉపాధి కోసం 6 నెలల కిందట వెళ్లిన వీరికి తినడానికి తిండి లేక రావటానికి అనుమతి లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నమని వాపోతున్నారు. స్వగ్రామాలకు వచ్చేందుకు అనుమతులు ఇవ్వాలని పలుమార్లు కోరినా అక్కడి పోలీసు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వగ్రామాలకు వచ్చేందుకు సాయం అందించాలని కడప జిల్లా ఎస్పీ, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేను వేడుకుంటున్నారు. ఈ మేరకు మీడియాకు వీడియో విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details