ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 3, 2020, 5:22 PM IST

Updated : Jun 4, 2020, 5:22 PM IST

ETV Bharat / state

'మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రుల జాబితాలోకి జగన్'

కడప జిల్లా జమ్మలమడుగు మోరగుడి గ్రామ సచివాలయంలో వైకాపా నాయకుడు రామసుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేస్తున్న పరిపాలన.. సేవలు, సంక్షేమ పథకాలతో దేశంలోని మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రుల జాబితాలో సీఎం జగన్ నాలుగో స్థానంలో ఉన్నారని తెలిపారు.

ycp leader ramasubbareddy conduct meeting in kadapa dst jammalamadugu about cm ruling in state
ycp leader ramasubbareddy conduct meeting in kadapa dst jammalamadugu about cm ruling in state

దేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎంగా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో ఉండటం సంతోషంగా ఉందని వైకాపా నేత రామసుబ్బారెడ్డి చెప్పారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామ సచివాలయంలో మాట్లాడిన ఆయన... 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు, స్థానిక భాజపా నేత, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి ముఖ్యమంత్రిపై బురద జల్లటం మానుకోవాలని హితవు పలికారు. సంక్షేమ పథకాలను పేదల కోసం ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారని కొనియాడారు.

Last Updated : Jun 4, 2020, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details