'ప్రతిపక్షాలవి అర్థంలేని విమర్శలు' - ramasubbareddy fire on ttd issue at kadapa district
తితిదే భూముల విక్రయ విషయంలో వైకాపా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, మీడియా బురదజల్లడం సరికాదని మాజీ మంత్రి, వైకాపా నేత రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న రామసుబ్బారెడ్డి
కడప జిల్లా జమ్మలమడుగులో వైకాపా నేత రామసుబ్బారెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. తితిదే భూముల విక్రయ విషయంలో ప్రతిపక్షాలు బురదజల్లడం సరికాదని ఆయన హితవు పలికారు. తితిదే భూములు విక్రయించే విషయంపై 1974 నుంచి చర్చ జరుగుతుందని చెప్పారు. గత తెదేపా హయాంలో తితిదేకు సంబంధించి నిరర్ధకమైన 50 ఆస్తులను గుర్తించి విక్రయించాలని అప్పటి బోర్డు నిర్ణయిస్తే మీడియా ఎందుకు ప్రచారం చేయలేదని ప్రశ్నించారు.
ఇదీచదవండి:వైకాపా ఇరు వర్గాల ఘర్షణలో 12 మందిపై కేసు నమోదు
TAGGED:
ramasubbareddy latest news