ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పులివెందులలో వైద్య కళాశాల ఏర్పాటుకు రూ. 500 కోట్లు మంజూరు

By

Published : Sep 13, 2020, 5:30 AM IST

కడప జిల్లాలోని పులివెందులలో వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను కేటాయించింది. వీటితో పాటు కళాశాల ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణకు మరో 104 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

ap government
ap government

ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైద్య కళాశాల ఏర్పాటుకు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులను శనివారం జారీ చేసింది. కళాశాలలో మౌలిక వసతులు, ఫర్నీచర్‌, వైద్య పరికరాల కొనుగోలుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. వీటితో పాటు కళాశాల ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణకు మరో 104 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.

ఈ కళాశాలకు వంద ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. పులివెందులలో ఏ ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న దానిపై జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసి... స్థలాన్నీ పరిశీలించింది.

ABOUT THE AUTHOR

...view details