ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శిరీష కుటుంబానికి తగిన న్యాయం: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ - మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

ముఖ్యమంత్రి వైయస్ జగన్​తో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ భేటీ అయ్యారు. ప్రేమోన్మాది చేతుల్లో మృతి చెందిన శిరీష కుటుంబానికి తగిన న్యాయం చేయాలని సీఎంను ఆమె కోరారు.

Women's Commission Chairperson Vasireddy Padma met cm jagan
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్

By

Published : Jun 30, 2021, 10:39 AM IST

ప్రేమోన్మాది చేతుల్లో మృతి చెందిన శిరీష కుటుంబానికి తగిన న్యాయం చేసే దిశగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఇటీవల ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన కడప జిల్లా బద్వేలుకు చెందిన శిరీష కేసును ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె కేసు వివరాలను జగన్​కు వివరించారు. దీంతో చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారని ఓ ప్రకటనలో ఆమె తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details