కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పరిధిలోని రెండు ప్రాంతాల్లో పిడుగు పడి మహిళ ఒకరు మృతి చెందగా … రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. అర్ధరాత్రి సమయంలో భయంకరమైన ఉరుములు, మెరుపులు వచ్చాయి. ఈ శబ్దానికి మల్లేపల్లెకు చెందిన ఓబగాని లక్ష్మీదేవి (38) అనే మహిళ మృతి చెందింది. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మలెగుడిపాడులో పిడుగుపాటుకు రెండు గేదెలు చనిపోయాయి. ఈ ఘటనతో రైతు ఆర్థికంగా నష్టపోయారు.
పిడుగుపాటుకు మహిళ, రెండు గేదెలు మృతి - Woman, two buffaloes killed in Thunderbolt
వేర్వేరు ప్రాంతాల్లో పడిన పిడుగులకు మహిళ, రెండు గేదెలు మృతి చెందిన ఘటన కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పరిధిలో చోటుచేసుకుంది.
Woman, two buffaloes killed in lightning strike