ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్ వివేకా హత్య కేసు.. మరో ముగ్గురి అరెస్టు!

వైఎస్​  వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులు మరో ముగ్గురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. పులివెందుల న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి 12 రోజుల రిమాండ్ విధించారు.

By

Published : Mar 28, 2019, 2:51 PM IST

Updated : Mar 28, 2019, 5:16 PM IST

viveka murder case

వివేకా హత్య కేసులో మరో ముగ్గురి అరెస్టు
వైకాపా అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్​​ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో పోలీసులు మరో ముగ్గురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, ప్రకాశ్​ను విచారణ చేస్తున్నారు.

12 రోజుల రిమాండ్

వివేకా మృతి అనంతరం నిందితులు సాక్ష్యాలు తారుమారు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనెల 15న ఉదయం స్నానాల గదిలో ఉన్న వివేకా మృతదేహాన్ని పడకగదికి తరలించినట్టు గుర్తించారు. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్లు పోలీసులు భావించారు. ఉదయం లేఖ దొరికినా.. సాయంత్రం వరకు పోలీసులకు ఇవ్వలేదనే కారణంతో పీఏ కృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. నిందితులుఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ను పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 12 రోజుల రిమాండ్ విధించారు.

Last Updated : Mar 28, 2019, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details