కడప జిల్లా కమలాపురం మండలం చిన్న చెప్పలి సచివాలయం వద్ద గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. నివర్ తుఫాన్ వల్ల దాదాపు 400 ఎకరాల్లోని పంట నష్టాన్ని.. సరిగా నమోదు చేయలేదంటూ నిరసనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆరోపించారు. ఈ-క్రాప్ బుకింగ్ చేసి.. వాటిని అంతర్జాలంలో నమోదు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
చిన్న శనగను మినుములుగా నమోదు:
ఆయా రైతుల పంట పొలాల్లో చేపట్టాల్సిన ఈ-క్రాప్ నమోదును.. అన్నదాతలను ఒకే చోటికి పిలిపించి చేశారని గ్రామస్థులు పేర్కొన్నారు. దాదాపు 90 శాతం రైతులు చిన్న శనగ పంట వేయగా.. సగానికిపైగా మినుములుగా నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటను గోదాముల్లో పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పినా అధికారులు వినిపించుకోలేదని తెలిపారు. వారు అంతర్జాలంలో నమోదు చేయని కారణంగా జాబితాలో తమ పేర్లు లేవని ఆరోపించారు.
స్పందన కరవైంది..