ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు కడప జిల్లాలో ఉపరాష్ట్రపతి వెంకయ్య పర్యటన

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. వెంకయ్య పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని చెర్లోపల్లి రైల్వేస్టేషన్​ సమీపంలోని సొరంగ మార్గాన్ని వెంకయ్యనాయుడు పరిశీలించనున్నారు.

By

Published : Aug 30, 2019, 11:43 PM IST

Updated : Aug 31, 2019, 12:57 AM IST

నేడు కడప జిల్లాలో ఉపరాష్ట్రపతి వెంకయ్య పర్యటన

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 30నిమిషాలకు నెల్లూరు జిల్లా వెంకటాచలం నుంచి ప్రత్యేక రైల్లో బయలుదేరి... సాయంత్రం 5 గంటలకు కడప జిల్లాలోని చెర్లోపల్లి రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. అక్కడినుంచి సమీపంలోని 7కిలోమీటర్ల రైల్వే సొరంగ మార్గాన్ని వెంకయ్య పరిశీలిస్తారు. అరగంటపాటు సొరంగ మార్గాన్ని పరిశీలించిన అనంతరం... అదే ప్రత్యేక రైల్లో వెంకటాచలం వెళ్తారని అధికారులు తెలిపారు. ఇటీవలే కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వేలైన్ ప్రారంభమైంది. ఈ మార్గంలో ప్రత్యేక గూడ్స్​ రైలు కూడా నడుస్తోంది. 7కిలోమీటర్ల సొరంగ మార్గం, కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి వెంకయ్యనాయుడు ప్రత్యేక కృషి చేశారు.

Last Updated : Aug 31, 2019, 12:57 AM IST

ABOUT THE AUTHOR

...view details