ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు నిత్యావసరాలు అందించిన వేమన వర్సిటీ వీసీ - yogi vemana versity vc distributed essentials to poor people

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. కడపలోని మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యోగి వేమన వర్సిటీ వీసీ పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

పేదలకు నిత్యావసరాలు అందించిన వేమన వర్సిటీ వీసీ
పేదలకు నిత్యావసరాలు అందించిన వేమన వర్సిటీ వీసీ

By

Published : Apr 29, 2020, 4:28 PM IST

కడప యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి సూర్య కళావతి పేదలు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. జిల్లాకు చెందిన మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాలు, కూరగాయలు అందజేశారు. కరోనా వ్యాప్తి నివారణకు పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆమె అన్నారు. ఆపద సమయంలో పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను ఆమె అభినందించారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండి.. వ్యక్తిగత దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి..

ఎండల్లో వానలు.. సేద తీరిన జనాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details