ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హత్యకేసులో గ్రామ వాలంటీర్​, బంధువుల అరెస్ట్ - కడప జిల్లా క్రైం వార్తలు

కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం వడ్డేపల్లిలో జరిగిన హత్యకేసులోని నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గ్రామ వాలంటీర్.... అతని బంధువులు కలిసి... మరణాయుధాలతో శంకరయ్య అనే వ్యక్తిని చంపేశారని సీఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు.

Vaddepalli murder accused arrested by Rayachoti police in Kadapa District
Vaddepalli murder accused arrested by Rayachoti police in Kadapa District

By

Published : Jun 5, 2020, 5:13 PM IST

Updated : Jun 5, 2020, 5:30 PM IST

కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం వడ్డేపల్లిలో నాలుగు రోజుల కిందట జరిగిన రైతు హత్య కేసులోని నిందితులను... పోలీసులు అరెస్టు చేశారు.

  • అసలేం జరిగింది....?

రాయితీ వేరుశెనగ విత్తన కాయలు కొనుగోలు చేసిన శంకరయ్యపై అదే గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శ్రీనివాసులు బంధువులు... డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో రెడ్డయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించి శంకరయ్య తిరిగి స్వగ్రామానికి వస్తుండగా... మార్గ మధ్యలో మారణాయుధాలతో గ్రామ వాలంటీర్ శ్రీనివాసులు, మరి కొంతమంది మాటు వేసి దాడి చేసి హతమార్చారని సీఐ లింగప్ప తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సురేంద్ర, మహేష్​లను వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

  • నిందితుల్ని ఎలా పట్టుకున్నారు..?

ముందస్తు సమాచారంతో రాయచోటి గాలివీడు ప్రధాన మార్గంలోని... రామాపురం క్రాస్ వద్ద మాటువేసి నిందితులను అరెస్టు చేశారని సీఐ వివరించారు. వారి నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకొని... కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండి:తెలంగాణ మద్యానికి రాష్ట్ర సరిహద్దుల్లోనే బ్రేక్

Last Updated : Jun 5, 2020, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details