ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల తీరుపై తులసిరెడ్డి ఆగ్రహం - thulasi reddy taja enws

తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేయటంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. అధికార పార్టీ నాయకులకు కరోనా పాజిటివ్ వస్తే హైదరాబాద్ లో వైద్యం చేయించుకోవటాన్ని తప్పుపట్టారు.

thulasi-reddy-fired-on-polcie-cut-hair-of-a-sc-boy-in-east-godavari-dst
thulasi-reddy-fired-on-polcie-cut-hair-of-a-sc-boy-in-east-godavari-dst

By

Published : Jul 22, 2020, 2:39 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక రవాణను అడ్డుకున్న దళిత యువకున్ని పోలీసులు చితకబాది, శిరోముండనం చేయటం అమానవీయ చర్య అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. కొంతమంది పోలీసులు ప్రభుత్వానికి కీలుబొమ్మలుగా మారారని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారని తులసిరెడ్డి కడపలో గుర్తు చేశారు. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, విజయసాయిరెడ్డికి కరోనా సోకితే... ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోకుండా హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనిద్వారా సామాన్య ప్రజలకు ఎలాంటి సందేశం పంపుతున్నారో తెలిపాలని డిమాండు చేశారు.

వైద్యులకు అందజేస్తున్న 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం జర్నలిస్టులకు కూడా వర్తించేలా చూడాలని ఆయన డిమాండు చేశారు.

ఇదీ చూడండి

సీతానగరంలో యువకుడి శిరోముండనం ఘటనపై సీఎం ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details