కడప కు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి నగరంలో ఇటీవల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఆరుబయట నిద్రిస్తున్న వారి నుంచి తాళాలు తీసుకుని దొంగతనాలు చేస్తాడని పోలీసులు పేర్కొన్నారు. ఇతనిపై గతంలో కేసులు ఉన్నాయన్న డీఎస్పీ.... జైలుకెళ్లొచ్చినా మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించాడని తెలిపారు. నిందితుడి నుంచి 5 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు - కడప జిల్లా నేర వార్తలు
లాక్డౌన్ను ఆసరా చేసుకొని కడప నగరంలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి బంగారు ఆభరణాలు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
![దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు Thief arrested in kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7351880-562-7351880-1590484935255.jpg)
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు