ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల అప్రమత్తత... ఓ కుటుంబాన్ని కాపాడింది - badhwel police

ఓ వ్యాపారి ఇంట్లో పనిచేసే వ్యక్తి... యజమాని కుటుంబ సభ్యులను హతమార్చి బంగారం దోచుకోవాలని పథకం రచించాడు. చోరీకి సర్వం సిద్ధం చేశాడు. ఇంతలోనే పోలీసులకు చిక్కాడు.

నిందితులతో పోలీసులు

By

Published : Jul 10, 2019, 11:55 PM IST

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

కడప జిల్లా బద్వేలు పోలీసులు... ఓ హత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... బద్వేలులోని నెల్లూరు రోడ్​లో వెంకట సుబ్బయ్య అనే వ్యాపారి ఇంట్లో సుభాష్ పనిచేస్తున్నాడు. వెంకట సుబ్బయ్య ఇంట్లో చోరీ చేసేందుకు సుబాష్ పథకం రచించాడు. యజమాని కుటుంబ సభ్యులను హతమార్చి బంగారు ఆభరణాలను దోచుకోవాలనుకున్నాడు. మరో నలుగురి సాయం తీసుకుని రెక్కీ నిర్వహించారు. పట్టణ సీఐలు మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న సుభాష్​ను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడే ఈ భారీ చోరీ విషయం వెలుగు చూసిందని మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వీరిలో ఇద్దరికి నేరచరిత్ర ఉందని వెల్లడించారు. నిందితుల నుంచి రెండు పిడిబాకులు, రెండు ఇనుప రాడ్లు, ఒక ఎక్స్​లేటర్ వైర్​ స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details