ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులను వైకాపా ప్రభుత్వం నట్టేట ముంచుతోంది'

వైకాపా ప్రభుత్వ పాలనపై కడప తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు లింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకోవడంలో జగన్ సర్కారు విఫలమైందని అన్నారు. నివర్ తుపానుతో నష్టపోయినవారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

By

Published : Dec 26, 2020, 6:47 PM IST

TDP  Parliament President  Lingareddy fire on YCP government
కడప తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి

వైకాపా ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించి, రైతులను నట్టేట ముంచుతోందని కడప తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు లింగారెడ్డి ఆగ్రహించారు. కడప ప్రెస్ క్లబ్​లో వివిధ పార్టీల ఆధ్వర్యంలో 'రైతుల కోసం' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, సున్నా వడ్డీ రుణాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో రాయితీ విత్తనాలు అందించాలన్నారు. పంటలకు బీమా కల్పించాలని.. నివర్ తుపానుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details