ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా మహిళా కార్యకర్త కిడ్నాప్ - yerraguntla

ఎర్రగుంట్ల మండలం వలసపల్లెకు చెందిన తెదేపా మహిళా కార్యకర్త పద్మావతిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. జమ్మలమడుగు వైకాపా అభ్యర్థి అనుచరులే తన తల్లిని కిడ్నాప్ చేశారంటూ ఆమె కుమారుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తెదేపా మహిళ కిడ్నాప్ పై పోలీసులతో విచారిస్తున్న మంత్రి ఆదినారాయణ రెడ్డి

By

Published : Apr 10, 2019, 2:17 AM IST

Updated : Apr 10, 2019, 7:27 AM IST

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వలసపల్లె గ్రామానికి చెందిన తెదేపా మహిళా కార్యకర్త పద్మావతిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. జమ్మలమడుగు వైకాపా అభ్యర్థి అనుచరులే తన తల్లిని కిడ్నాప్ చేశారంటూ ఆమె కుమారుడు స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ రోజు ఏజెంటుగా కూర్చుంటుందనే కారణంతోనే కిడ్నాప్‌ చేసినట్లు తెదేపా నేతలు ఆరోపణలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కడప తెదేపా ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు అభ్యర్థి రామ సుబ్బారెడ్డి, ఎంపీ సీఎం రమేష్ ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

తెదేపా మహిళా కార్యకర్త కిడ్నాప్
Last Updated : Apr 10, 2019, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details