ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 1, 2020, 4:54 PM IST

ETV Bharat / state

నివర్ తుపాన్ బాధితులకు సాయం అందించిన తెదేపా

నివర్ తుపాన్ బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక సభ్యులు హరిప్రసాద్ ఆరోపించారు. వరద ప్రవాహానికి గురైన బాధితులకు నవంబర్ నెలకు సంబంధించి విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని కోరారు.

భోజన ప్యాకెట్లన పంపిణీ చేస్తున్న తెదేపా నాయకులు
భోజన ప్యాకెట్లన పంపిణీ చేస్తున్న తెదేపా నాయకులు

కడపలో నివర్ తుపాన్ బాధితులకు తెదేపా ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. వెయ్యి మందికి వీటికి అందించారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక సభ్యులు హరి ప్రసాద్ మాట్లాడుతూ.. వరదల్లో చిక్కుకున్న ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం బాధితులను ఏ మాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. 2001 లో ఇలాంటి వరదల వచ్చినప్పుడు అప్పటి తెదేపా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 20 వేల రూపాయలు పరిహారం ఇచ్చినట్లు గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details