ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎంకు మహిళలంటే గౌరవం లేదు: తెదేపా నేత శ్రీదేవి

గుంటూరులో జరిగిన జైల్​భరో కార్యక్రమంలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై... తెదేపా నేతలు మండిపడ్డారు. సీఎం జగన్​కు మహిళలంటే కనీస గౌరవం కూడా లేదని కడప జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి విమర్శించారు.

By

Published : Nov 1, 2020, 4:31 PM IST

tdp leader sridevi fires on ycp about police attack on women in jail bharo programme
సీఎంకు మహిళలంటే గౌరవం లేదు: తెదేపా నేత శ్రీదేవి

గుంటూరు జైల్​భరో కార్యక్రమంలో మహిళలతో పోలీసులు వ్యవహరించిన తీరుపై కడప పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి ధ్వజమెత్తారు. సీఎం జగన్​కు మహిళలంటే కనీస గౌరవం కూడా లేదని మండిపడ్డారు. అమరావతి రైతులు అడుగుతున్న న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించడంలో జగన్ మొండి వైఖరి అవలంబించడం సరైంది కాదని ఖండించారు.

మహిళల ఓట్లు అయితే కావాలి కానీ.. వారి సమస్యల పరిష్కారం అక్కర్లేదా అంటూ ఆమె ప్రశ్నించారు. రాజధాని అమరావతిలో ఉండడం వల్ల సీఎంకు నష్టమేంటని ప్రశ్నించారు. మూడు రాజధానుల వల్ల కలిగే లాభాలు ఏంటో అందరికీ తెలియజేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజురోజుకూ అమ్మాయిలపై, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయని... మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన చెందారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details