ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీసులు ..అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారు' - మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్ తాజా వార్తలు

కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గంలో పోలీసులు .. అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారని తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జ్, తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్​యాదవ్ ఆరోపించారు. మైదుకూరు డీఎస్పీ విజయ్​కుమార్ వ్యవహార శైలిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు.

tdp leader putta sureshkumar yadav outraged on maidukur dsp vijayakumar
మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్​పై పుట్టా సుధాకర్ యాదవ్ ఆగ్రహం

By

Published : Jun 1, 2020, 3:56 PM IST

కడపజిల్లా మైదుకూరు నియోజక వర్గంలో పోలీసులు .. అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారని తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జ్, తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్​యాదవ్ ఆరోపించారు. గ్రామాల్లో ఫ్యాక్షన్ పురిగొల్పే విధంగా డీఎస్పీ వ్యవహరిస్తున్నారని ఆయన కడపలో ఆక్షేపించారు. తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదుకూరు డీఎస్పీ విజయ్​కుమార్.. వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చాలా గ్రామాల్లో పార్టీ మారాలని పోలీసులే బెదిరిస్తుండటం సిగ్గుచేటన్నారు. డీఎస్పీ వ్యవహార శైలిపై 2వ తేదీన డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు. సెలవుల అనంతరం కోర్టులో పిటిషన్ వేస్తామని పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details