ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి: గోవర్ధన్ రెడ్డి - kadapa latest news

కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఖరిపై తెదేపా నేత గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి నియంత్రణలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించాలని డిమాండ్ చేశారు.

tdp leader govardhan reddy fire on ycp government
తెదేపా నేత గోవర్ధన్ రెడ్డి

By

Published : May 3, 2021, 4:24 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆస్పత్రిలో ప్రాణవాయువు లేక ఎందరో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి (హెల్త్ ఎమర్జెన్సీ) విధించాలని డిమాండ్ చేశారు. కడపలో మాట్లాడిన గోవర్ధన్ రెడ్డి... ఆస్పత్రుల్లో పడకలు లేక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వం స్పందించి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details