ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 4, 2020, 1:27 AM IST

ETV Bharat / state

పోలీసుల అదుపులో ఎర్ర చందనం కేసుల నిందితుడు

రైల్వే కోడూరు తాడివాండ్ల పల్లికి చెందిన రౌడీ షీటర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా ఇతని కదలికలపై సమాచారం అందుకున్న మేరకు.. దాడులు చేసి చాకచక్యంగా అరెస్టు చేశారు.

task force police caught rowdy sheeter
రౌడీ షీటర్​ను అదుపులోకి తీసుకున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు

ఎర్ర చందనం కేసుల్లో నిందితుడిగా ఉండడమే కాక.. రౌడీషీటర్ అయిన రవికుమార్ (35)ను.. కడప జిల్లా రైల్వే కోడూరు పోలీసులు అరెస్టు చేశారు. తాడివాండ్ల పల్లికి చెందిన ఇతని కదలికలపై సమచారం అందుకున్న ఆర్ఐ కృపానంద, సివిల్ పీసీ శ్రీహరిలు పోలీసుల బృందాన్ని అక్కడకు రైల్వే కోడూరుకు పంపించారు. చాకచక్యంగా వల వేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని పట్టుకొని స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details