కడపజిల్లా కేఎస్ఆర్ఎమ్ క్వారంటైన్లో పంజాబ్ నుంచి వచ్చిన బీటెక్ విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ నెల 12, 16 తేదీల్లో కడప జిల్లాకు వచ్చిన 47 మంది విద్యార్థులు...కోవిడ్ 19 రూల్స్ ప్రకారం వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో వారికి కరోనా నెగిటివ్ రావడంతో స్థానిక కేఎస్ఆర్ఎమ్ గణేష్ హాస్టల్లో 14 రోజులు కామన్ క్వారంటైన్కు పంపారు. పంజాబ్ ప్రభుత్వం కోవిడ్ పరీక్షలు చేసి...గృహనిర్బంధానికి సిఫార్సు చేస్తే.. ఈ ప్రభుత్వం క్వారంటైన్లో ఉంచిందని విద్యార్థులు అధికారులతో గొడవకు దిగారు. రెండు రోజుల నుంచి కనీసం మెనూ ప్రకారం కూడా ఆహారం అందించడంలో అధికారులు విఫలమైనారని విద్యార్థులు ఆరోపించారు. కనీసం మాకు కడుపునిండా అన్నం పెట్టడం లేదని వాపోయారు. శానిటైజర్ కూడా ఇవ్వటంలేదని తెలిపారు.ఇంటికి వెళ్లి గృహనిర్బంధంలో ఉంటామని...ఇంటికి పంపిచాలని అధికారులను వేడుకున్నారు. ఇళ్లకు పంపించేదాకా భోజనం చేయమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటికి పంపించాలని క్వారంటైన్లో విద్యార్థుల ఆందోళన - కడపజిల్లా కేఎస్ఆర్ఎమ్ క్వారంటైన్ కేంద్రం తాజా వార్తలు
కడప జిల్లా కేఎస్ఆర్ఎమ్ క్వారంటైన్లో పంజాబ్ నుంచి వచ్చిన బీటెక్ విద్యార్థులు నిరసనకు దిగారు. క్వారంటైన్ కేంద్రంలో ఆహారం సరిగా లేదని, కనీసం శానిటైజర్స్ను కూడా ఇవ్వట్లేదని విద్యార్థులు ఆందోళన చేశారు. పంజాబ్ ప్రభుత్వం కోవిడ్ పరీక్షలు చేసి...గృహనిర్బంధానికి సిఫార్సు చేస్తే.. ఈ ప్రభుత్వం క్వారంటైన్లో ఉంచిందని వారు వాపోయారు.
కడపజిల్లా కేఎస్ఆర్ఎమ్ క్వారంటైన్లో విద్యార్థుల నిరసన