ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 1, 2020, 7:58 AM IST

ETV Bharat / state

గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్న రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మెన్

పవిత్ర గండి ఆంజనేయస్వామిని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ దేవిరెడ్డి శ్రీనాథ్​రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు.

Gandi Anjaneyaswamy
రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి

కడప జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్ర మైన గండి ఆంజనేయస్వామిని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ దేవిరెడ్డి శ్రీనాథ్​రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ మర్యాదలతో సత్కరించి ఆశీర్వచనాలు అందించారు. గండి పుణ్య క్షేత్ర విశిష్టత గురించి అర్చకులు ఆయనకు వివరించారు.

జిల్లాలో పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నట్లు శ్రీనాథ్ తెలిపారు. ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ ఆలయం వద్దకు చేరుకోగానే ఆలయ పర్యవేక్షకులు రవిచంద్రా రెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి పి. రాజశేఖర్ రెడ్డి, సెరి కల్చర్ అధికారి టి. రాజగోపాల్ రెడ్డి, జర్నలిస్టులు,ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details