కడప జిల్లా, జమ్మలమడుగులో గురువారం తితిదే కళ్యాణ మండపంలో శ్రీవారి లడ్డూలను తితిదే నిర్వహకులు విక్రయించారు. జమ్మలమడుగు ప్రాంతానికి ఎనిమిది వేల లడ్డూలను కేటాయించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఒక్కొక్కరికి నాలుగు లడ్డూల చొప్పున 25 రూపాయలతో విక్రయించారు. శ్రీవారి లడ్డును దక్కించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున వరుసలో నిలబడ్డారు.
జమ్మలమడుగులో శ్రీవారి లడ్డూల విక్రయం - Srivari Laddu latest news jammalamdugu
జమ్మలమడుగులో శ్రీవారి లడ్డూలను తితిదే నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. డిమాండ్ను బట్టి ఈ నెల 30వ తేదీ వరకు లడ్డూలు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామని తితిదే నిర్వహకులు తెలిపారు.

జమ్మలమడుగులో శ్రీవారి లడ్డుల విక్రయం
Last Updated : May 28, 2020, 10:50 PM IST