కొవిడ్ చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై పోలీసులు, విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. కరోనా వైద్యానికి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్పై చర్యలు తీసుకున్నామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కడప జిల్లా కేంద్రంలోని రెండు ఆస్పత్రులపై కేసులు నమోదు చేశామని చెప్పారు.
అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ అన్బురాజన్ - kadapa district sp anburajan news
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కొవిడ్ వైద్యానికి అధిక ఫీజులు వసూలు చేస్తున్న రెండు ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

ఎస్పీ అన్బురాజన్
ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ధరలపై మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొవిడ్ చికిత్స అందించాలని ఎస్పీ తెలిపారు. ఏ ఆస్పత్రిలో అయినా అధిక ఫీజులు వసూలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా విపత్కర సమయంలో సేవ చేయాల్సిన బాధ్యతను వైద్యులకు గుర్తు చేశారు.
ఇదీ చదవండి:'శుభకార్యాలకు 50 మందికి మాత్రమే అనుమతి'