ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు' - ప్రొద్దుటూరు పీఎస్​లో తనిఖీలు చేసిన ఎస్పీ వార్తలు

కడప జిల్లా ప్రొద్దుటూరు గ్రామీణ పీఎస్​ను ఎస్పీ అన్బురాజన్ తనిఖీ చేశారు. స్టేషన్​లోని రికార్డులను పరిశీలించారు. అసాంఘికకార్యకలాపాల విషయంలో పోలీసుల పాత్ర ఉందని తెలిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చోరీలు జరగకుండా గస్తీ ముమ్మరంగా చేపట్టాలని సూచించారు.

కడప జిల్లా ప్రొద్దూటూరు గ్రామీణ పీయస్​ను ఎస్పీ అన్బురాజన్ తనిఖీ
కడప జిల్లా ప్రొద్దూటూరు గ్రామీణ పీయస్​ను ఎస్పీ అన్బురాజన్ తనిఖీ

By

Published : Aug 13, 2020, 9:04 AM IST

అసాంఘిక కార్యకలాపాల విషయంలో పోలీసు అధికారుల పాత్ర ఉందని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు గ్రామీణ పోలీస్ స్టేషన్​ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్​లోని రికార్డులు పరిశీలించారు మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్​లపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. చోరీకేసులో సొత్తు త్వరగా రికవరీ చేయాలని ఆదేశించారు. చోరీలు జరగకుండా పోలీసు గస్తీ ముమ్మరంగా నిర్వహించాలని చెప్పారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. స్పందన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని డీఎస్పి సుధాకర్, సీఐ విశ్వనాథ్ రెడ్డిలను ఎస్పీ ఆదేశించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details