ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 18, 2020, 5:49 PM IST

ETV Bharat / state

దుప్పి మాంసం విక్రయించిన వ్యక్తుల అరెస్టు

గుర్తు తెలియని వాహనం ఢీకొని దుప్పి మృతిచెందిందంటూ కడప జిల్లా పోరుమామిళ్లలో మాంసం విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు నిందింతులను అదుపులోకి తీసుకున్నారు.

some people are arrested FOR sale of  dhuppi meat at kadapa
దుప్పి మాంసం అమ్మకానికి పాల్పడిన వ్యక్తులు అరెస్టు

దుప్పి మాంసం అమ్మకానికి పాల్పడిన వ్యక్తులు అరెస్టు

వన్యప్రాణి మాంసం అమ్మకానికి పాల్పడిన పలువురు వ్యక్తులను కడప జిల్లాలో అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. పోరుమామిళ్లలో చోటుచేసుకున్న ఈ ఘటనలో దుప్పి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఎద్దు అడుగు కనుమ వద్ద రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని దుప్పి మృతి చెందింది. సమీప గ్రామానికి చెందిన వ్యక్తులు మృతి చెందిన అడవి జంతువును తీసుకెళ్లి మాంసం విక్రయానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న సిబ్బంది నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details