ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆరుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్

By

Published : Apr 22, 2021, 8:45 PM IST

ఐపీఎల్ మ్యాచ్​లు​ జరుగుతున్న నేపథ్యంలో.. క్రికెట్​ బెట్టింగ్​కి పాల్పడిన ఆరుగురుని పోలీసులు అరెస్టు చేసిన ఘటన కడప జిల్లాలోని దువ్వూరు, రాజంపేటలో జరిగింది. నిందితులను రిమాండుకు తరలించినట్లు అదనపు ఎస్పీ దేవప్రసాద్ తెలిపారు. బెట్టింగ్​రాయుళ్ల నుంచి లక్షా 20 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆరుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్
ఆరుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్

ఐపీఎల్​ మ్యాచ్​ సందర్భంగా .. కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. దువ్వూరు, రాజంపేట మండలాలకు చెందిన ఆరుగురు బుకీలను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు అదనపు ఎస్పీ దేవప్రసాద్ తెలిపారు. దువ్వూరు మండలం మాచనపల్లె గ్రామం వద్ద క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న రాజా రామ్మోహన్ రెడ్డి తోపాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.

రాజంపేట మండలంలో యాప్ ద్వారా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సుబ్బరాయుడు అనే యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. సుబ్బరాయుడు ఇప్పటికే 25 లక్షల రూపాయల బెట్టింగ్​లో పోగొట్టుకున్నట్లు గుర్తించారు. రెండు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి లక్షా 20 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు.

ఇవీ చదవండి

వైద్యకళాశాల నిర్మాణానికి ఎంపీ అవినాష్ రెడ్డి భూమిపూజ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details