మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న పరమేశ్వరరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయాలని పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలైంది. పరమేశ్వరరెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపరిచిన పోలీసులు... నార్కో అనాలసిస్ పరీక్షలు చేసేందుకు కోర్టు అనుమతి కోరారు. పరమేశ్వరరెడ్డి సమ్మతితోనే నార్కో అనాలసిస్ పరీక్షలు చేయాలని కోర్టు అనుమతించింది. నార్కో పరీక్షల కోసం ముగ్గురు అనుమానితులను పోలీసులు గుజరాత్కు తరలించారు. రంగన్న, ఎర్ర గంగిరెడ్డి, శేఖర్రెడ్డిని మూడ్రోజుల క్రితం గుజరాత్ తీసుకెళ్లారు.
నార్కో పరీక్షకు వివేకా హత్యకేసు నిందితులు - Pulivendula court
వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, శేఖర్ రెడ్డిని నార్కో పరీక్షల నిమిత్తం గుజరాత్కు తరలించారు. పరమేశ్వర్ రెడ్డిని సైతం గుజరాత్ తరలించనున్నారు. మొత్తం నలుగురు అనుమానితులకు వివేకా హత్యకేసులో నార్కో పరీక్షలు చేయనున్నారు.
![నార్కో పరీక్షకు వివేకా హత్యకేసు నిందితులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3992595-604-3992595-1564501147710.jpg)
వివేకా హత్యకేసు... నార్కో పరీక్షలకు అనుమానితులు
వివేకా హత్యకేసు... నార్కో పరీక్షలకు అనుమానితులు
ఇదీ చదవండీ...'సెల్టవర్ ఎక్కిన అగ్రికల్చర్ విద్యార్థులు'